కాశీబుగ్గ, ఫిబ్రవరి24: వరంగల్ ఎనుమాము ల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ఎర్ర బంగా రం పోటెత్తింది. ప్రస్తుత మిర్చి సీజన్ జనవరి నుంచి ప్రారంభం కాగా, అత్యధికంగా శుక్రవారం మార్కెట్కు సుమారు 65వేల మిర్చి బస్తాలు వచ్చాయి. సీజన్ ప్రారంభంలో ప్రతి రోజూ వెయ్యి నుంచి 10 వేల బస్తాలు వచ్చాయి. మార్కె ట్కు పెద్ద ఎత్తున మిర్చి రావడంతో రైతులు, వివిధ కార్మికులు, అడ్తి, కరీదు వ్యాపారులు సం తోషం వ్యక్తం చేశారు. తేజ రకం మిర్చి క్వింటాకు అత్యధికంగా రూ.19,800, మధ్య రకం రూ. 17,500, కనిష్ఠంగా 15వేలు, వండర్ హాట్కు అత్యధికంగా రూ. 35వేలు, మధ్యరకం రూ. 33 వేలు, కనిష్ఠంగా రూ.30వేలు, యూఎస్ 341 అ త్యధికంగా క్వింటాకు 21,100, మధ్య రకం రూ. 18వేలు, కనిష్ఠంగా రూ.16వేలు, దేశీ రకం అత్య ధికంగా క్వింటాకు రూ.53వేలు, మధ్య రకం రూ. 50వేలు, కనిష్ఠంగా రూ.45వేలు, సింగిల్పట్టి అత్యధికంగా క్వింటాకు రూ.38వేలు, మధ్యరకం రూ.35వేలు, కనిష్ఠంగా రూ.33వేలు, 1048 రకం మిర్చి అత్యధికంగా క్వింటాకు రూ.18,500, మధ్యరకం రూ.17వేలు, కనిష్ఠంగా రూ. 14 వేలు, తాలు మిర్చి అత్యధికంగా క్వింటాకు రూ. 8,500, మధ్య రకం రూ.7వేలు, కనిష్ఠంగా రూ. 4వేలు ధరలు పలికినట్లు అధికారులు తెలిపారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చియార్డులో ఎలాంటి జీరో వ్యాపారం జరు గకుండా అధికారులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తు న్నారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్ రాహుల్, డీఎంఓ పాలకుర్తి ప్రసాదరావుకు సమా కయచారం అందిస్తున్నారు. రైతుల సరుకులకు భద్రత కల్పించి మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా చూడాలని సంబంధిత అధికారులను డీఎంఓ ప్రసాదరావు ఆదేశించారు. అలాగే మా ర్కెట్ నుంచి బయటకు వెళ్లే వ్యవసాయ ఉత్పత్తు లను గేటు దగ్గర సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.