హనుమకొండ చౌరస్తా, మే 17 : రాష్ట్రాల మధ్య సాంసృతిక మార్పిడిని ప్రోత్సహించేందుకే భారత ప్రభుత్వం యువ సంఘం కార్యక్రమం చేపట్టింద ని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. ఈశాన్య ప్రాంత యువత, మిగిలిన దేశంలోని యువత మధ్య సన్నిహిత సంబం ధాలను పెంపొందించడానికి ఈ కార్య క్రమంలో భాగంగా వరంగల్ నిట్కు ఉత్తరాఖండ్కు చెందిన 45 మంది ప్రతినిధులు చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి వరంగల్ నిట్లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో డైరెక్టర్తో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ డైరెక్టర్ ప్రొ ఫెసర్ బిద్యాధర్ సుబుధి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకరి కొకరు సంసృతిపై సామరస్యాన్ని, గౌరవాన్ని మెరుగుపరుస్తుందన్నారు. వారి పర్యటనలో ఆనందకరమైన సమయా న్ని గడపాలని ఆకాంక్షించారు.
రామప్ప దేవాలయ సందర్శన..
ఉత్తరాఖండ్కు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం రామప్ప ఆల యా న్ని సందర్శించారు. ఆరు రోజుల పాటు వారు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా బుధవారం రామప్ప దేవాలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ, వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మొదటిరోజు ఉత్తరాఖండ్ ప్రతినిధులు ఆనందంగా గడిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
వరంగల్ నిట్లో నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రతినిధులు వారి ప్రదేశాలలో ప్రసిద్ధి చెందిన వివిధ సాంసృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. వరంగల్ నిట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాగసుధా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ వైఎన్ రెడ్డి, రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్రావు, ఐఐటీ రూర్కే నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీ సునీల్కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
22న ముగింపు..
ఈనెల 18న గురువారం భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, సుందిళ్ల బ్యా రేజీ, నంది పంపుహౌస్ సందర్శించనున్నారు. 19న ప్రముఖ ఫార్మాకంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీ, టీహబ్, సాలర్జంగ్ మ్యూజియం, పర్యాటక ప్రాం తాలు, దేవాలయాలు, 20వ తేదీన లక్నవరం, కాకతీయ ఫోర్ట్, ముద్దనూరు గ్రామాన్ని సందర్శించనున్నారు. అలాగే 21న దయం రాజ్భవన్లో గవర్నర్ను కలవనున్నారు. అనంతరం చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, సమతామూర్తి విగ్ర హం, అంబేద్కర్ విగ్రహం, చారిత్రక ప్రాంతాలైన నిజాం, మొఘల్స్ డైనాస్టిలను సందర్శించనున్నారు. 22న వరంగల్ నిట్లోని వివిధ విభాగాలతో పాటు సెంట్రల్ ఇన్స్ట్రూమెంటేషన్స్ ఫెసిలిటీస్ను పరిశీలించనున్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలకనున్నారు.