జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్సీగా కొట్టె సుధాకర్రెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఇటీవల ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా, జగిత్యాలలో ఇరిగేషన్ శాఖ సీఈగా పనిచేస్తున్న సుధాకర్రెడ్డికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బరాజ్ మరమ్మతు బాధ్యతలు ఆయన భుజానపడ్డాయి.