ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతర నిర్వహణకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
ములుగు జిల్లా కలెక్టర్లుగా గత జాతరల్లో విధులు నిర్వర్తించిన ఐఏఎస్లు ఆర్వీ కర్ణన్, ఎస్.కృష్ణఆదిత్యతోపాటు ములుగులో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా పనిచేసి, ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఆదర్శ్ సురభితోపాటు హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న ప్రతిమాసింగ్, రాధికాగుప్తాలను నియమించారు. వీరంతా శనివారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు మహా జాతర నిర్వహణలో నోడల్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించనున్నారు.