హనుమకొండ, నవంబర్ 4 : రెండు,మూడు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి, శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు హైదరాబాద్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి, రాకవపోవడంతో మనస్తాపం చెందిన రాకేశ్రెడ్డి, కమలం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో బీఆర్ఎస్ స్టేషన్ఘన్పుర్, జనగామ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి ఉన్నారు.