గిర్మాజీపేట, ఫిబ్రవరి 28: జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం వరకు 1,88,297 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి. అందులో 31,809 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేయగా, 19,793 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చారు. మంగళవారం వరకు 3,321మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందజేశారు. జిల్లాలో 92 గ్రామ పంచాయతీలు, 20వార్డుల్లో కంటివెలుగు పరీక్షలు పూర్తి కాగా, మిగతా 25 జీపీలు, 19 వార్డుల్లో త్వరలోనే కంటిపరీక్షలు పూర్తి కానున్నాయి. 1,88,297 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా, అందులో 88,074 మంది పురుషుల కు, 1,00,107 మంది మహిళలు, మంది 104 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. 28,499 ఎస్సీలు, 19,902 ఎస్టీలు, 1,27,187 బీసీలు, 8,176 ఓసీలు, 5,331 మైనార్టీలు, 40 ఏండ్లలోపు ఉన్న 4,159 మంది, 40 ఏళ్లు పైబడిన 27,642 మందికి కంటిపరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 1,36,695 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని పేర్కొన్నారు.
వినియోగించుకోవాలి
గిర్మాజీపేట: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీషా పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె మండిబజార్ గోల్డెన్ డైమండ్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ‘కంటివెలుగు’పై అవగాహన సదస్సులో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత బస్వరాజు డాక్టర్ మౌనిక, సూపర్వైజర్ మసూద్అలీ, ఆర్పీలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, బీఆర్ఎస్ ముఖ్యనాయకులు ఎండీ మస్తాన్, బండారి సదానందం, జన్ను శ్యామ్, బిల్ల రమేశ్, పప్పుల మంజుల, జన్ను అనిల్, సిరిబోయిన రాజు, ఎండీ మతిన్, ఎండీ యాకూబ్, మలుగూరి నెల్సన్ పాల్గొన్నారు.
రాగంపేటలో..
ఖానాపురం: రాగంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు మంగళవారం ప్రారంభించారు. గ్రామంలో కంటి శిబిరం పేదలకు వరం వంటిదని తెలిపారు. సర్పంచ్ భాషబోయిన అయిలయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పాల్గొన్నారు.
ముత్తోజిపేటలో..
నర్సంపేట రూరల్: మండలంలోని ముత్తోజిపేటలో కంటి వెలుగు శిబిరం మంగళవారం ప్రారంభమైంది. శిబిరాన్ని సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. వైద్యాధికారి బానాల అరుణ్చంద్ర, కంటి వెలుగు క్యాంప్ ఇన్చార్జి డాక్టర్ కవిత, వార్డు సభ్యులు బూర సుమన్, చాంద్పాషా, పంచాయతీ కార్యదర్శి యుగేందర్రెడ్డి ఉన్నారు.
మైలారం, సూర్యతండాల్లో..
రాయపర్తి: మండలంలోని మైలారం, సూర్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను జడ్పీటీసీ రంగు కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్పంచ్లు లేతాకుల సుమతీ యాదవరెడ్డి, మునావత్ అమ్మిమాంజ్యానాయక్, ఎంపీటీసీలు గాడిపల్లి వెంకన్న, మునావత్ వెంకన్న, వైద్యారోగ్య సిబ్బంది ధరావత్ భీమానాయక్, మహేశ్, అరుణ్, రజిత, వంశీ, శ్రీలక్ష్మీ, మునావత్ శ్రీనివాస్, గబ్బెట బాబు, ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, లేతాకుల మాధవరెడ్డి, సంది వంశీధర్రెడ్డి, గబ్బెట లక్ష్మీ యాకయ్య, బాద సారయ్య, కుందూరు యాదగిరిరెడ్డి, పరుపాటి రవీందర్రెడ్డి, చందునాయక్, గూడెల్లి వెంకటయ్య, ఎల్లస్వామి, వెంకటయ్య, చెన్నంగి పాల్గొన్నారు.