గిర్మాజీపేట, జూలై 17: ప్రజారోగ్యమే బీఆర్ఎస్ ప్రభుత్వ సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలోని ఖిలావరంగల్కు చెందిన పాన్షాప్ నిర్వాహకుడు గంగరబోయిన శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ ఫుట్బాల్ నేషనల్ క్రీడల్లో ఆడుతుండగా మోకాలికి తీవ్రగాయమైంది. స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బాధితుడు శ్రీనివాస్కు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకోసం రూ.లక్ష ఎల్వోసీ చెక్కును సోమవారం ఎమ్మెల్యే శివనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ప్రజలు ఎల్వోసీ, సీఎంఆర్ఎఫ్ వినియోగించుకోవాలని కోరారు. కార్పొరేటర్లు ఓని భాస్కర్, పుర్ఖాన్, బీఆర్ఎస్ నేత భోగి సురేశ్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఆల్ట్రేడ్ యూనియన్ సభ్యుల ఆహ్వానం
బీజేపీ అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై బుధవారం రాజశ్రీగార్డెన్లో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి రావాల్సిందిగా యూనియన్ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే నరేందర్ను శివనగర్లోని క్యాంప్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని, నిరసనగా ఆల్ట్రేడ్ యూనియన్ సభ్యులు తలపెట్టిన కార్యక్రమానికి పార్టీలకతీతంగా కార్మిక సంఘాలు కదిలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. బీఆర్టీయూ అర్బన్ అధ్యక్షుడు భోగి సురేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గన్నారపు రమేశ్, ఐఎన్టీయూసీ పుల్లా రమేశ్ పాల్గొన్నారు. అలాగే, నూతనంగా ఎంపికైన జిల్లా గౌడ సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే నరేందర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వారికి ఎమ్మెల్యే నియామకపుపత్రాలను అందజేశారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షురాలుగా పోశాల పద్మ, ప్రధాన కార్యదర్శిగా మండ శ్యామ్, యూత్ ప్రెసిడెంట్గా గొడిశాల సూరజ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా గట్టు రమేశ్, తూర్పు నియోజకవర్గ కన్వీనర్గా మిట్ట ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులుగా నర్మెట్ట లింగమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మోడెం యాదగిరికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.