జెండా పండుగకు వేళయింది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, వరంగల్లోని ఖుష్మహల్, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం, భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం, ములుగు జిల్లాకేంద్రంలోని తంగేడు మైదానాలను వివిధ రంగులతో తీర్చిదిద్దారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం షామియానాలు, కుర్చీలు సిద్ధం చేయగా వేదిక పరిసరాలను మువ్వన్నెల జెండాలతో అందంగా ముస్తాబుచేశారు.
ఉదయం 9 గంటలకు కలెక్టర్లు ఎక్కడికక్కడ జాతీయ జెండాలను ఆవిష్కరించనుండగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసేలా శకటాలను ప్రదర్శించనున్నారు. కాగా మూడు రంగుల జెండాలు, బ్యాడ్జ్లు, డ్రెస్సులు, వివిధ అలంకరణ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొంది. – నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 25