పోచమ్మమైదాన్, జనవరి 2 : ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని డీఎంహెచ్వో వెంకట రమణ అన్నారు. వరంగల్లోని కెమిస్ట్ భవన్, ఇన్నర్ వీల్ క్లబ్లో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించి, మాట్లాడారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ప్రజలకు సులభంగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే వృద్ధులకు ప్రత్యేక సెంటర్ల ద్వారా అన్ని రకాల చికిత్స అందుబాటులో ఉంటుందని వివరించారు.
డిప్యూటీ డీఎంహెచ్వో గోపాల్రావు మాట్లాడుతూ.. ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఇన్చార్జి డీపీహెచ్ఎన్వో జ్ఞానసుందరి, శిక్షణ టీవోటీలు స్వరూప, మనుజ, వరమ్మ, రజిని, శిక్షణ కో ఆర్డినేటర్ ప్రకాశ్రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
నియామకపత్రాల అందజేత..
గిర్మాజీపేట : డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి కొత్తగా నియమితులైన 8 మంది వైద్యాధికారులకు డీఎంహెచ్వో కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. నియామకపత్రాలను అందుకున్న వైద్యాధికారులు మంగళవారం నుంచి విధుల్లో చేరుతారన్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో నూతన వైద్యాధికారులు కృషి చేయాలన్నారు.