హనుమకొండ, మే 23 : దేశంలో ఎక్క డా లేనివిధంగా తొలిసారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపణీ పథకాన్ని గొల్ల, కురుమలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో పథకం రెండో విడుత లబ్ధిదారుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథులుగా చీఫ్ విప్తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ యాదవుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. విలీన గ్రామాలకు కూడా పథకాన్ని వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. యూనిట్కు గతంలో రూ.1.25 లక్షలు ఉండగా రూ.1.75లక్షలకు పెంచినట్లు తెలిపారు. విలీన గ్రామాలకు దాదా పు 6870 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
లబ్ధిదారులకు నాణ్యమైన గొర్రె లు పంపిణీ చేసేలా చూడాలని కలెక్టర్కు సూచించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య మాట్లాడుతూ యాదవులకు అవగాహన కార్యక్రమాలు పెట్టి, ఈ నూతన విధానాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ పథకం విది విధానాలు, అమలు చేస్తున్న విధానంలో లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే తెలపాలన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ మా ర్గదర్శకాలకు అనుగుణంగా పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాగా, గ్రామాలైన సోమిడి, కాజీపేట దర్గా, శాయంపేట, దీన్దయాళ్నగర్, యాదవనగర్, రాంపూర్, ఉనికిచెర్ల, గుండ్ల సింగారం గొర్రెల పెంపకందారులకు గొర్రెల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే వెంకట నారాయణ తెలిపారు. లబ్ధిదారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో కార్పొరేటర్లు, సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ వెంకటేశ్వర్లు, పశు వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ వినయ్, డాక్టర్ క్రాంతి, వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
కుల సంఘాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
కుల సంఘాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన నాయీబ్రాహ్మణ సేవా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా చీఫ్ విప్తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి వినయ్భాసర్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులకు రాష్ట్రంలోనే మొదటి సారగి హనుమకొండ నగరం నడిబొడ్డున స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలనైనా పరిషరించడంలో ముందుంటానని పేర్కొన్నారు.
వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ నాయీ బ్రాహ్మణులకు కార్పొరేటర్ను టికెట్ కేటాయించినట్లు తెలిపారు. కష్టపడ్డ వారికి కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. భవనం నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కమ్యూనిటీ భవన నిర్మాణానికి హైదరాబాదులో, హనుమకొండలో స్థలం కోసం సురేశ్, రాములు ఎంతగానో కష్టపడ్డారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కుల సంఘాలకు, కులవృత్తులకు అత్యంత గౌరవం లభించిందన్నారు. ఐక్యతతో పనిచేయాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్ ఎలకంటి రాములు, నెకొండ కవితా కిషన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, సంఘం నాయకులు సురేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.