దుగ్గొండి: ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. బుధవారం పల్లె ప్రగతి అభివృద్ది పనుల పరిశీలనలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాభివృద్ది పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో గామాభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను వందశాతం పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీదర్గౌడ్, సర్పంచ్లు సమతారాజు రవీందర్నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శులు రాజు, సంతోష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.