నర్మెట, డిసెంబర్ 19: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెటలోని వినాయక గార్డెన్లో నిర్వహించిన మండల స్థాయి కృతజ్ఞత సమావేశానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. నీలిమ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. శాసనసభ్యుడిగా తనకు వచ్చే వేతనాన్ని నియోజకవర్గ ప్రజల కోసం వెచ్చిస్తానన్నారు. విద్యుత్ సంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేసున్నదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని పల్లా వివరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దన్నారు.
ప్రగతిభవన్ అనేది సీఎం నివాసమని, దానిని ప్రజాభవన్గా మార్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ముళ్ల కంచెలు వేశారని, వాటిని ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి తొలగించారని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఎంపీపీ తేజావత్ గోవర్ద్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గద్దల నర్సింగరావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, బీఆర్ఎస్ నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రామిని శివరాజ్, నాయకులు జంగిటి అంజయ్య, నీరేటి సుధాకర్, ప్రజ్ఞాపురం అంజయ్య, ఆమెడపు కమలాకర్రెడ్డి, నర్ర వెంకటరమణారెడ్డి, బానోత్ రవి, కంతి రాజలింగం, మంకెన ఆగిరెడ్డి, బానోత్ శంకర్నాయక్, పిట్టల రాజు, బావండ్లపల్లి రాజు, జాల కిషన్, పండుగ మల్లేశం, నక్కల రవి, జినుక రవి పాల్గొన్నారు.