పర్వతగిరి, అక్టోబర్ 30 : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ట్రైనర్ సత్యప్రకాశ్తో కలిసి గ్రామాల్లో పోలింగ్ బూత్ స్థ్ధాయిలో 100 ఓట్ల ఇన్చార్జులు, గ్రామాల పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనన్నారు. ఎన్నికల ప్రచార శైలి, అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ వెళ్లి వివరించాలన్నారు. గ్రామాలు, తండాలలో జరిగిన అభివృద్ధిని చూసి, ప్రజలు ఎన్నికల్లో బీర్ఎస్ను గెలిపించడం ఖాయమన్నారు. పథకాలను అమలు చేసిన తీరును ప్రజలకు వివరించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, మార్కెట్ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతంగౌడ్, నాయకులు మేడిశెట్టి రాములు, పంతులు, చింతపట్ల సోమేశ్వర్రావు, సర్వర్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రావు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, ఎంపీటీసీ మాడుగుల రాజు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల వడ్లకొండలో లింగాల సాంబయ్య, వల్లందాసు బాలమ్మ మృతి చెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు.
నయీంనగర్ : గ్రేటర్ 2వ డివిజన్ గుండ్ల సింగారం బీసీ కాలనీకి చెందిన సుమారు 50 మంది యువకులు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. హనుమకొండ ప్రశాంత్నగర్లోని తన నివాసంలో వారికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ కండువాలు కప్పి ఆహ్వనించారు. కార్యక్రమంలో ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ గణిపాక విజయ్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.