రాయపర్తి, డిసెంబర్ 8: సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ బూత్ కమిటీల నియామక మండల ఇన్చార్జి అనుమాండ్ల దేవేందర్రెడ్డి అన్నారు. కొండూరు గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దేశబోయిన ఉపేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు, కుగ్రామాలు, మారుమూల పల్లెల్లో నివాసముంటున్న సబ్బండ వర్గాల ప్రజల సమస్యలు, గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకే తెలుస్తాయన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ మండలంలోని అర్హులకు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలు, పార్టీ శ్రేణులపై ఉందన్నారు. అనంతరం 150 మంది ఓటర్లకు ముగ్గురు ఇన్చార్జిల చొప్పున పార్టీ సీనియర్ నాయకులకు నియమించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ కర్ర సరితా రవీందర్రెడ్డి, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, సొసైటీ చైర్మన్ జక్కుల వెంకట్రెడ్డి, నాయకులు పూస మధు, పంతంగి నర్సయ్య, గ్రామ ఇన్చార్జిలు బాషబోయిన సుధాకర్యాదవ్, గుగులోత్ జాజునాయక్, ముత్తడి సాగర్రెడ్డి, కర్ర రవీందర్రెడ్డి, పోల్నేని శ్యామ్రావు, పులి సోమయ్యగౌడ్, పెండ్లి వెంకన్న, కొమ్ము రాజు, నేరెల్లి మహేశ్, వీరమనేని సత్యనారాయణరావు, ఆవుల కేశవరెడ్డి, గుగులోత్ సోమన్న, సంపత్రావు, పుల్లా ఎల్లాగౌడ్, నేరెల్లి రాములు పాల్గొన్నారు.
బంధన్పల్లిలో బూత్ కమిటీల ఎన్నిక
బంధన్పల్లిలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎలుకపల్లి రమేశ్, గ్రామ ఎన్నికల ఇన్చార్జి సంకినేని ఎల్లస్వామి, సర్పంచ్ భూక్యా దీప్లానాయక్, ఉప సర్పంచ్ అడ్డాల నాగేశ్వర్రావు, ఓరువాల మల్లయ్య, డెక్క అశోక్, చెవ్వ సంపత్, చెవ్వ సత్యనారాయణ, పసుల రాజయ్య పాల్గొన్నారు.