వరంగల్, జూన్ 27 : ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న పేదల జీవితాలపై బల్దియా అధికారులు కొరడా ఝులిపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుట్పాత్లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొని పొట్టపోసుకుంటున్న వారిపై జులుం ప్రదర్శించారు. నగరంలోని కాళోజీ సెంటర్తోపాటు ఏకశిల పార్కు వద్ద టిఫిన్ సెంటర్లతో జీవనం గడుపుతున్న వారి డబ్బాలను తొలగించారు. ఒక్కసారిగా బల్దియా టౌన్ప్లానింగ్ సిబ్బంది, పోలీసులు జేసీబీలు తీసుకొచ్చి డబ్బాలను తొలగించడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేయిస్తున్న బడా వ్యాపారస్తుల జోలికి వెళ్లకుండా, రోడ్డు పక్కన డబ్బా పెట్టుకొని బతుకుతున్న పేదలపై బల్దియా అధికారుల జులుం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్ స్థలం లేకున్నా అనేక పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనుమతి ఇచ్చిన బల్దియా రోడ్డు పక్కన ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులపై కొరడా ఝులింపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ అధికారులే మా జీవితాలతో ఆడుకుంటుంటే ఎలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి వచ్చి డబ్బాలను తొలగిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని రోదించారు. అందాల పోటీల నేపథ్యంలో అందాల భామలు నగరానికి వస్తున్నారని ప్రధాన రహదారిలోని చిరు వ్యాపారాలన్నింటిని తొలగించారు. ఇప్పుడు మళ్లీ బల్దియా అధికారులు తమ వ్యాపారాలను తొలగించారని వాపోయారు.