ఖిలావరంగల్, మే 26: రైల్వే ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (నంబర్ 20806) రైలులో సాంకేతిక లోపం వల్ల ఏసీపీలు పని చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. రైల్వే అధికారులు రైలును వరంగల్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. అయితే, వరంగల్ రైల్వేస్టేషన్కు సాయంత్రం 5.29 గంటలకు రావాల్సి ఉండగా, రాత్రి 7.09 గంటలకు చేరుకుంది. కాగా, ఏసీలు ఎంతకూ రిపేర్ కాకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైల్వే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యామ్నాయంగా ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు లోకోను ఏపీ ఎక్స్ప్రెస్కు అమర్చి రాత్రి 10.55 గంటలకు రైలును వరంగల్ నుంచి పంపించారు. ఏసీలు పని చేయకపోవడం వల్ల ఏపీ ఎక్స్ప్రెస్ రైలు వరంగల్ రైల్వేస్టేషన్లో 2.46 గంటలపాటు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.