కాజీపేట, జనవరి 30: కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి అయోధ్య వరకు ఏర్పాటు చేసిన ఆస్తా ప్రత్యేక రైలును రైల్వేశాఖ మంగళవారం సాయంత్రం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భక్తులు వెనుదిరిగి వెళ్లారు. సాంకేతిక కారణాలతో ఆస్తా రైలును రద్దు చేశామని, టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ 24 గంటల ముందే రైల్వే శాఖ మెసేజ్ పంపిందని అధికారులు తెలిపారు.