హసన్పర్తి, జనవరి 12: విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓ యూనివర్సిటీలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావాలకాలనీకి చెందిన రాథోడ్ దీప్తి(19) బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కళాశాల హాస్టల్ రూమ్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులతో కలిసి ఉంటున్నది.
బీటెక్ విద్యార్థులకు సెలవు ఇవ్వడంతో ఆ ముగ్గురు హాస్టల్కు రాలేదు. రూమ్లో దీప్తి ఒక్కతే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థిని చున్నీతో హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీప్తి ఫస్ట్ ఇయర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతోపాటు ప్రేమ విఫలంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు