ములుగు రూరల్, ఫిబ్రవరి 13: ములుగు జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో ఆడవేషంలో జీపీ కార్యదర్శి తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బీ వేణుగోపాల్ ఆడవేషంలో ములుగుకు వచ్చాడన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద పలువురిని ఆడవేషంలో ప్రాంక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు ఆడవేషంలో ఉన్నది మగ వ్యక్తి అని గురించి, ఇటీవల చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా గుమ్మడపల్లి జీపీ కార్యదర్శి వేణుగోపాల్గా తేలిందన్నారు. వృత్తి రీత్యా కార్యదర్శిగా పనిచేస్తూ అప్పుడప్పుడు ఆడ వేషం లో ప్రాంక్ చేయడం సరదాగా మా ర్చుకున్నాడని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం కు టుంబ సభ్యులకు సమాచారం ఇ చ్చామన్నారు. కాగా, ప్రభుత్వ ఉ ద్యోగం చేస్తూ ఇలా చేయడమేమిటని మందలించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై చెప్పారు.