ములుగు రూరల్, ఏప్రిల్ 2 : రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని, రైతులకు అండగా ఉంటామని ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ సూపరింటెండెంట్కు ఆమె వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ మద్దతు ధరపై క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ గాలికి వదిలేసిందన్నారు. బోనస్ ఇవ్వకుంటే 6న నిరసన దీక్ష చేపడుతామని హెచ్చరించారు.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. నష్టాల్లో ఉన్న రైతులకు సర్కారు మద్దతుగా నిలువాలన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్య మురళి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద్నాయక్, ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, లాలూనాయక్, నాయకులు రమేశ్రెడ్డి, భిక్షపతి, ఓదెలు, గండి కుమార్, చంద్రమౌళి, రాందాస్, రాణాప్రతాప్, గరిగె రఘు, తిరుపతి, శ్రీనివాస్, కాసీం, జంపన్న, దిలీప్, మహేందర్, నాజర్ఖాన్, జితేందర్, సురేశ్రెడ్డి ఉన్నారు.