త్వరలో ప్రారంభించేందుకు కార్యాచరణ
మొక్కలు నాటేందుకు శాఖల వారీగా కేటాయింపులు
డీఆర్డీఏకు 42.27లక్షలు, అటవీ శాఖకు 14.50 లక్షలు
గ్రామాల్లోని నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు
ప్రతి మొక్కనూ సంరక్షించడమే లక్ష్యం
భూమి మీద కోట్లాది జీవరాశి మనుగడకు ఆధారం పచ్చని చెట్లు.. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పచ్చదనం ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ సర్కారు అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే ఏడు విడుతల్లో విజయవంతంగా మొక్కలను నాటించింది. ప్రస్తుతం ఎనిమిదో విడుతకు సన్నద్ధమైంది. త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 69.97 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించిన అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఇప్పటికే కలెక్టర్ శశాంక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి శాఖల వారీగా లక్ష్యాన్ని కేటాయించారు. డీఆర్డీఏకు 42.27లక్షలు, అటవీ శాఖకు 14.50లక్షలు టార్గెట్గా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సరిపడా మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు.
మహబూబాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో విడుతలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 69.97లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే కలెక్టర్ శశాంక అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా లక్ష్యాన్ని కేటాయించారు. కాగా, 2017-67లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా నాటారు. 2018- 86 లక్షలు, 2019-90లక్షలు, 2020- 92 లక్షలు, 2021- 94లక్షలు, 2022లో 96 లక్షల మొక్కలు హరితహారం కింద నాటారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలు ఏపుగా పెరిగి జిల్లాలోని గ్రామాలు, రోడ్లు, ఇతర ప్రాంతాలు హరితవనాలుగా మారాయి. ఈ ఏడాది 69.97లక్షల మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో శాఖలవారీగా లక్ష్యం కేటాయించారు. డీఆర్డీఏ 42.27లక్షలు, అటవీశాఖ 14.50లక్షలు, పాఠశాల విద్యాశాఖ 50వేలు, ఇంటర్మీడియట్ 10వేలు, ఆర్అండ్బీ 50వేలు, పంచాయతీరాజ్శాఖ లక్ష, ఇరిగేషన్ 50వేలు, ఎక్సైజ్ 80వేలు, వ్యవసాయ శాఖ 2.50లక్షలు, ఉద్యానశాఖ లక్ష, పోలీస్ 1.50లక్షలు, వైద్యారోగ్యశాఖ 10వేలు, పరిశ్రమలశాఖ 10వేలు, బీసీ వెల్ఫేర్ 10వేలు, మైనార్టీ వెల్ఫేర్ 10వేలు, ట్రైబల్ వెల్ఫేర్ 40వేలు, మహబూబాబాద్ మున్సిపాలిటీ 1.75లక్షలు, డోర్నకల్ 75వేలు, మరిపెడ 75వేలు, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 75వేలు, మొత్తం 69.97లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలను పెంచుతున్నారు.
నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్ర మం కోసం జిల్లా లక్ష్యానికి సరిపడే విధంగా పలు శాఖల వారు నర్సరీల్లో మొక్కలను పెం చుతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 45.67 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇవి డీఆర్డీఏతో పాటు విద్యాశాఖ, ఆర్అండ్వీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎక్సైజ్ శాఖలకు అందించనున్నారు. వ్యవసాయ శాఖ 2.50లక్ష లు, ఉద్యానశాఖ లక్ష, పోలీస్శాఖ-1.50లక్షలు, వైద్యారోగ్యశాఖ 10వేలు,పరిశ్రమలశాఖ 10వేలు, బీసీ వెల్ఫేర్ 10వేలు, మైనార్టీ వెల్ఫేర్ 10వేలు, ట్రైబల్ వెల్ఫేర్ 40వేలు, మహబూబాబాద్ మున్సిపాలిటీ- 1.75 లక్షలు, డోర్నకల్ మున్సిపాలిటీ 75వేలు, మరిపెడ మున్సిపాలిటీ 75వేలు, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 75వేలు. మొ త్తం 24.30లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
హరితహారానికి ఏర్పాట్లు..
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 69.97 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. డీఆర్డీఏ పరిధిలో 45.67లక్షలు, పలు శాఖలు కలిపి 20.30లక్షలు, నాలుగు మున్సిపాలిటీలు కలిపి 4లక్షల మొక్కలను నర్సరీల్లో పెంచారు. – సన్యాసయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి