నర్సంపేట, అక్టోబర్ 28: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలను కోరారు. నర్సంపేట 16వ వార్డులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవన్నారు. రైతులు, ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజా సంక్షేమమే పని చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలవాలని కోరారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని గుర్తుచేశారు. పేదలకు లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ దళితబంధు, బీసీబంధు, రుణ సాయం తదితర పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో రాజేశ్, జగదీశ్వర్, నవీన్కుమార్, ఎస్ మధు, గొర్రె సుకుమార్, మడికొండ ప్రభాకర్, సంగునాల గణేశ్, సంగునాల శ్రీను, ఎండీ అక్బర్, ఎండీ ఫిరోజ్, ఎస్కే యూసుఫ్, బేరి మనోజ్, సమీర్, నదీన్ఖాన్, వడిచర్ల ప్రవీణ్, తుమ్మల రామ్చరణ్, సందీప్, ఆరీఫ్, అబ్దుల్ రహీం, ఆదిత్య, మార్త హరిప్రసాద్, ఇర్ఫాన్, అసీఫ్, అబుబాకర్, రాజశేఖర్రావు, తుమ్మలపెల్లి తరుణ్, రామగిరి త్రినేశ్, ఇడిగాని జడ్సన్, బొల్లపెల్లి హేమంత్, నందరిగి విజయ్, చందగిని చంద్రశేఖర్, అజార్, సచిన్, వరప్రసాద్, రాజు, రఘు, భానుప్రసాద్, హైమద్, అప్రోజ్, శివాజీ, యాకూబ్, రాకేశ్, సతీశ్, జెమిని, గౌతం, గుంషా ఉన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రాయిడి దుష్యంత్రెడ్డి, కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ-రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.
పథకాలకు ఆకర్షితులై..
నర్సంపేటరూరల్: సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురిజాలకు చెందిన పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పోటు లక్ష్మారెడ్డితోపాటు మరో ఐదుగురు పెద్ది సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్గౌడ్, సర్పంచ్ గొడిశాల మమత-సదానందంగౌడ్, ఎంపీటీసీ బండారు శ్రీలత-రమేశ్, ఉప సర్పంచ్ మంచిక హరీశ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, ఆర్బీఎస్ మండల కన్వీనర్ అన్న కోమల-రాజమల్లు, పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు ముదురు రమేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఎడ్ల రవీందర్ పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టాలి..
ఖానాపురం: నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి తనకు పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారిపేటలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మండలంలో వలసల జోరు
నెక్కొండ: మండలంలో బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. సీపీఎం మండల కార్యదర్శి ఈదునూరి వెంకన్న, మాజీ వార్డు సభ్యురాలు ఈదునూరి మాలతి, పట్టణ అధ్యక్షుడు పలుసం ముత్తయ్యతోపాటు పలు గ్రామాలకు చెందిన సీపీఎం నాయకులు నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో సీపీఎంకు చెందిన డాక్టర్ ఈదునూరి రాఘవులు, అన్నమనేని రవీందర్రావు, మాచర్ల వెంకటయ్య, సంగి పుల్లయ్య, ఆడెపు సారయ్య, శ్రీమంతుల బ్రహ్మయ్య, బోయిని గోపాల్, బత్తిని చంద్రయ్య, వీరగోని రమేశ్, రేకుల రాజయ్య, మాలోత్ చిట్టిబాబు, బైరి పద్మ, లింగోజు మంజుల, కక్కెర్ల శారద, కాసు దేవేందర్రాజు, గుగులోత్ బిచ్చా, మహేంద్ర, లింగోజి, సుబ్బమ్మ, బానోత్ రవి, ఈదునూరి చందు, ఈదునూరి సురేశ్, వల్లందాసు నిశాంత్, ఈతునూరి బబ్లు, జిల్లా భిక్షపతి, జిల్లా హైమ, కట్ట రామారావు, జిల్లా రేణుక ఉన్నారు. కార్యక్రమంలో నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, పీపీ షేక్ అబ్దుల్నబీ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, సీనియర్ నాయకుడు గుంటుక సోమయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే రాష్ట్రంలో సంక్షేమం
బీఆర్ఎస్తోనే రాష్ట్రంలో సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పొనకల్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంతి అనుచరుడు బుస్సారి బాబురావుతోపాటు పులువురు కార్యకర్తలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఎంపీటీసీ పిండి కుమారస్వామి, బండి జగన్, సీనియర్ నాయకుడు వంగేటి అశోక్, క్లస్టర్ ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో పాటు తదితర గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండంలోని చెరువుకొమ్ముతండా, జల్లి గ్రామాలకు చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బాల్నె వెంకన్న, క్లస్టర్ బాధ్యులు బద్దూనాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ
రాష్ట్రంలో బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ద్వారకపేట ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న సందర్భంగా పాటించాల్సిన వ్యూహాలపై పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. పని చేసేది ఎవరో.. పారిపోయేది ఎవరో… ప్రజలు తేల్చే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. మన బలం, బలగం ముందు ప్రతిపక్షాల స్థాయి చాలా చిన్నదన్నారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణ, రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, బత్తిని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, మోతె జయపాల్రెడ్డి పాల్గొన్నారు.