నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియ డంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరు గుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. దీంతో మేడారం పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
– తాడ్వాయి, ఫిబ్రవరి 25
మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనం జనంతో మహానగరాన్ని తలపించింది. నాలుగు రోజుల పాటు భక్తులతో కళకళలాడిన మేడారం జాతర పరిసరాలు ఖాళీ అవుతున్నాయి. సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా తెలుగు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులు శివరాంసాగర్, జంపన్నవాగు, చిలుకల గుట్ట, ఆర్టీసీ బస్టాండ్, పలు చోట్ల వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారులు, భక్తులు లక్షలాది మంది విడిది చేయడంతో ఎటుచూసినా గుడారాలతో నిండిపోయింది.
జాతర ముగిసిపోవడంతో వ్యాపారులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడంతోపాటు భక్తుల సంఖ్య కూడా తగ్గిపోవడంతో మేడారం పరిసరాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పాటు వివిధ రకాల వ్యాపారులతో నాలుగు రోజుల పాటు సందడిగా మారిన జాతర పరిసరాలు నిశ్శబ్దంగా మారుతూ మేడారం పాత రూపును సంతరించుకుంటున్నది.
ఆదివారం సెలవుదినం కావడంతో భారీగా జనం తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవా ర్లకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సుమారు నాలుగు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.