సుబేదారి : పార్ట్టైం జాబ్ కోసం ఓ యువకుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తుడి చేతిలో చిక్కి రూ.37లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దమ్మగడ్డకు చెందిన అన్వేష్ ఫోన్కు గతేడాది అక్టోబర్ 11న పార్ట్టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది.
ఆ లింక్ ఓపెన్ చేయగా ‘తక్కువ డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు’ అని సైబర్ నేరస్తుడు చేసిన ఆన్లైన్ చాటింగ్ను నమ్మి దశలవారీగా ఇప్పటివరకు రూ.37లక్షల 59వేల 924 పెట్టుబడి పెట్టాడు. తీరా అకౌంట్ బ్లాక్ చేయడంతో బాధితుడు అన్వేష్ మోసపోయానని గ్రహించి శుక్రవారం హనుమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.