సుబేదారి, మార్చి7: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 24 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు గురువారం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఉత్తర్వులు జారీ చేశారు. సుబేదారిలో పనిచేస్తున్న ఎస్ వాసుదేవరావు మల్టీజోన్కు, ఆయన స్థానంలో మల్టీజోన్ నుంచి సత్యనారాయణరెడ్డి వచ్చారు. కమలాపూర్లో పనిచేస్తున్న బీ సంజీవ్ కేయూసీకి, ఇదే స్థానంలో పనిచేస్తున్న వీ చేరాలు వీఆర్కు బదిలీ అయినారు. మల్టీజోన్లో ఉన్న ఈ హరికృష్ణ కమలాపూర్కు, వీఆర్లో ఉన్న ఎం శివకుమార్ ఇంతేజార్గంజ్కు, ఇక్కడ పనిచేస్తున్న ఎల్ పవన్కుమార్ గీసుగొండకు బదిలీ అయ్యారు. ఇదే స్థానంలో ఉన్న బాబులాల్ వీఆర్కు బదిలీ అయ్యారు. టాస్క్ఫోర్స్ విభాగంలో ఉన్న పులి రమేశ్ ఎనుమాములకు బదిలీ అయ్యారు. ఇదే స్టేషన్లో పనిచేస్తున్న పీ కిషన్ ఎస్బీకి, అక్కడ ఉన్న వీ క్రాంతికుమార్ ఆత్మకూరుకు, ఇక్కడ పనిచేస్తున్న ఆర్ సంతోష్ పీసీఆర్కు అటాచ్డ్ అయ్యారు. వీఆర్లో ఉన్న కే సూర్యప్రసాద్ వరంగల్ అర్బన్ మహిళా పీఎస్కు, ఇక్కడ పనిచేస్తున్న కే శ్రీధర్రావు సీసీఆర్బీకి వచ్చారు. మల్టీజోన్లో ఉన్న ఎన్ వెంకటరత్నం సుబేదారి రూరల్ మహిళా పీఎస్కు, ఇక్కడ పనిచేస్తున్న ఏ సువర్ణ భరోసా సెంటర్కు అటాచ్డ్ అయ్యారు. సీసీఆర్బీలో ఉన్న ఎంఏ షూకూర్ హనుమకొండ ట్రాఫిక్కు, ఇదే స్థానంలో పనిచేస్తున్న జీ సీతారెడ్డి ఎస్బీకి బదిలీ అయ్యారు. ఎస్బీలో ఉన్న నాగబాబు కాజీపేట ట్రాఫిక్కు, ఇక్కడ పనిచేస్తున్న కే సుజాతను షీటీంకు అటాచ్డ్ చేశారు. మల్టీజోన్లో ఉన్న సార్ల రాజు టాస్క్ఫోర్స్కు, వీఆర్లో ఉన్న ఎస్ రవికుమార్ టాస్క్ఫోర్స్కు, అక్కడ ఉన్న కే దామోదర్, టాస్క్ఫోర్స్లో ఉన్న జీ వేణు మల్టీజోన్కు బదిలీ అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్తో 24 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. వీరిలో చాలా మంది ఇటీవలే నేతల సిఫారసుతో పోస్టింగ్లు పొందారు. నెల రోజులు కూడా కాకుండానే మళ్లీ బదిలీ కావడంతో తలులు పట్టుకుంటున్నారు. పోస్టింగ్ల కోసం డబ్బులు పెట్టిన ఇన్స్పెక్టర్లకు ఈ బదిలీలు మింగుడు పడడం లేదు.