దహెగాం, మే 7: నిరుపేద ఆడబిడ్డల కోసమే తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నదని ఎంపీపీ కంభగౌని సులోచన అన్నారు. ఎమ్మెల్యే కోనప్ప ఆదేశాల మేరకు మండలంలోని చిన్నరాస్పల్లి, గెర్రె, గిరివెల్లి, ఖర్జీ, రాంపూర్, మొట్లగూడ, లగ్గాం, దహెగాం, తదితర గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి 68 మందికి చెక్కులను శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణలక్ష్మి ద్వారా ప్రభుత్వం రూ లక్ష 116 అందిస్తున్నాదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, ఆర్ఐ మోహన్, సర్పంచులు కారు రాజన్న, నాయకలు ప్రసాద్రాజ్, తుమ్మిడ మల్లేశ్, దందెర వెంకన్న, నజీర్, సంతోష్ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి , మే 7: మండల కేంద్రంతో పాటు కర్జెల్లి, రుద్రాపూర్, బాబాసాగర్, డబ్బా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీపీ డుబ్బుల నానయ్య శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు కాగా, 33 మందికి పంపిణీ చేశామని, మిగితా వారికి శనివారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, డీటీ బీమ్లానాయక్, సీనియర్ అసిస్టెంట్ నాందేవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మారుతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భీంకరి నారాయణ, జాబారి భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.