HomeWarangal-rural132 Electric Buses Will Be Available In Warangal Region In The First Release
ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్..
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
త్వరలో పరుగులు తీయనున్న ఈ-బస్సులు
దశల వారీగా ప్రవేశపెట్టనున్న ఆర్టీసీ
వరంగల్ రీజియన్లో తొలి విడుతలో అందుబాటులోకి 132 బస్సులు
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ-బస్సులను రోడ్లపై పరుగులు తీయించేందుకు సన్నాహాలు చే స్తోంది. వీటిని దశల వారీగా ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ రీజియన్ పరిధిలో తొలివిడుతలో 132 ఈ-బస్సులను అందుబాటులోకి తేనుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గనుంది.
– హనుమకొండ చౌరస్తా, మే 18
డీజిల్ వినియోగాన్ని తద్వారా పొల్యూషన్ను తగ్గించడానికి ప్రాధాన్యతనిస్తూ ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో ఈ-బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న కాలంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సర్కారు ప్రైవేటు సంస్థల ద్వారా ఈ-బస్సులను టీఎస్ ఆర్టీసీకి అందజేయనుంది. ఈ మేరకు వరంగల్ రీజియన్ను ఈ-బస్సులు రానున్నాయి.
తొలి విడుతలో 132 ఈ-బస్సులు
ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగ ల్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యా లయంలో సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలోని పలు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన రూట్లు, సాధ్యాసాధ్యాల గురించి చర్చించా రు. బస్ డిపోల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు.
త్వరలో బస్సు సర్వీసులు..
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యా లు అందించేందుకు టీఎస్ ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత సంస్థ బలోపేతానికి చర్యలు తీసు కుంటున్నారు. తాజాగా వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ రహితంగా, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, హైటెక్ హంగులతో ఈ-బస్సులను నడుపనున్నారు.
తగ్గనున్న కాలుష్యం..
ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు మార్కెట్లోకి వచ్చాయి. టీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను విడుతల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిం చేందుకు ఆర్టీసీ ఈ-బస్సులను ప్రవేశ పెడుతున్నది.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా..
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నాం. వచ్చే రెండేళ్ల లో టీఎస్ ఆర్టీసీ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడుపనుంది. తొలి విడుతగా 132 ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నాం. కాలుష్యరహితం కోసం టీఎస్ ఆర్టీసీ ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది.