నెక్కొండ, అక్టోబర్ 25 : రూ.2.75లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సీఐ హతీరాం తెలిపారు. నెక్కొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై జానీపాషాతో కలిసి సీఐ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దౌవగాన్ గ్రామానికి చెందిన గోబింద బెహర్ బుధవారం నెక్కొండ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
11 కిలోల ఎండు గంజాయిని డిప్యూటీ తహసీల్దార్ పీ రవి సమక్షంలో స్వాధీనం చేసుకున్నామని, గంజాయి విలువ రూ.2.75లక్షలని తెలిపారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా ఖలెమెలా మండలం ఎంపీబీ-26కు చెందిన సమీర్ హోల్డర్ నుంచి ఎండు గంజాయి కొనుగోలు చేశాడని సీఐ చెప్పారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కానిస్టేబుళ్లు ఎస్ రాకేశ్, ఎండీ అన్వర్ఖాన్ పాల్గొన్నారు.