న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో చైనా పదేపదే చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టి బదులిచ్చేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక విశేషాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లలో శుక్రవారం లాంఛనంగా పొందుపరిచింది.
సరిహద్దు రాష్ట్రంలోని ప్రాంతాలకు చైనా తరచూ కొత్త పేర్లు పెడుతూ వస్తున్న నేపథ్యంలోనే ఈ చర్యకు ఉపక్రమించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.