హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.
హైదరాబాద్లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. భారత సైబర్ భద్రత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్స్ కౌన్సిల్ (ఎన్సీఎస్ఆర్సీ) కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం, పౌరులు అందరూ కలిసి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.