అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది టీఆర్ఎస్లో చేరిక
నయీంనగర్, జూలై 12 : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగర్లోనిఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ తనను నమ్మి వచ్చిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ చేరికలు టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అంచూరి విజయ్ కుమార్, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్లాల్, ఉప సర్పంచ్ శివకుమార్, చిరంజీవి, బీసీ సెల్ అధ్యక్షుడు రామ్లక్ష్మణ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేద ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా
హసన్పర్తి : పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55వ డివిజన్ పరిధిలోని భీమారానికి చెందిన సంగాల పరమేశ్కు రూ.60 వేలు, గడ్డం కర్ణసేనకు రూ.16,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా, వాటిని మంగళవారం ఎమ్మెల్యే రమేశ్, కార్పొరేటర్ జక్కుల రజితావెంకటేశ్వర్లతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ 55వ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, యూత్ అధ్యక్షుడు గుంజే సాయికుమార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సురేశ్, టీఆర్కే రెడ్డి పాల్గొన్నారు.