నర్సంపేటరూరల్, మార్చి 10: పాడి గేదెల పథకం పైలట్ ప్రాజెక్టుగా నర్సంపేట డివిజన్ ఎంపికైందని, ఒక్కో యూనిట్కు 70 శాతం సబ్సిడీపై మ్తొతం వెయ్యి యూనిట్లకు రూ. 14 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో దళితుల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డివిజన్వ్యాప్తంగా దళితులకు ఒక్కో యూనిట్కు రూ. 2 లక్షలతో రెండు బర్రెలను అందిస్తామని తెలిపారు. గతంలో నియోజకవర్గంలో 650 యూనిట్ల (ఒక్కో యూనిట్కు నాలుగు బర్రెలు) పాడి గేదెలను దళిత లబ్ధిదారులకు అందించినట్లు వెల్లడించారు. దళిత రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. విజయ డెయిరీ హామీతో ఒక్కో యూనిట్కు రైతులు రూ. 60 వేల నగదును బ్యాంకు రుణం కింద ఒప్పందం చేసుకోవాలని కోరారు.
రూ. 1.40 లక్షల సబ్సిడీ పోను మిగితా రూ. 60 వేలను విజయ డెయిరీకి పాలు పోసి బ్యాంకు రుణం తీర్చే విధంగా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ఎలాంటి షూరిటీ లేకుండా భూమి లేని వారికి కూడా ఈ పథకం వర్తించేలా రూపొందించినట్లు తెలియజేశారు. మరో వారం రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. ఆసక్తి కలిగిన ప్రతి దళిత రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. డివిజన్లోని నెక్కొండ మండలానికి 200 యూనిట్లు, నల్లబెల్లికి 150, ఖానాపురం 100, నర్సంపేట రూరల్ 150, దుగ్గొండి 200, నర్సంపేటటౌన్కు 50, చెన్నారావుపేట మండలానికి 150 యూనిట్లు మంజూరైనట్లు వివరించారు.
గ్రామాల అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం
రాష్ట్రంలోని గ్రామాలు, తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఉప్పరపల్లిలో రూ. 3 కోట్ల నిధులతో చేపట్టిన బీటీ, సీసీరోడ్ల నిర్మాణ పనులకు పెద్ది శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద గ్రామమైన ఉప్పరపల్లి గతంలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. అంతర్గతరోడ్ల నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించారన్నారు. గత ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఉప్పరపల్లి నుంచి నెక్కొండ మండలం సీతారాంపురం వరకు రూ. 1.95 కోట్ల అంచనా వ్యయంతో బీటీరోడ్డు, రూ. 1.20 కోట్లతో గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణ పనులు చేపట్టామన్నారు.
త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లకు పెద్ది సూచించారు. అలాగే, మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలోనే ఈ గ్రామాన్ని ఎంపిక చేసి రూ. 5 కోట్లతో సకల సౌకర్యాలతో పాఠశాలలను పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. రహదారుల కోసం నిధుల మంజూరుకు సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, చెన్నారావుపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, ఎంపీపీ విజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, రైతుబంధు సమితి డైరెక్టర్ బుర్రి తిరుపతి, సర్పంచ్ కుండె మల్లయ్య, ఎంపీటీసీ విజేందర్రెడ్డి, మహేందర్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, యువ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి పాల్గొన్నారు.