రాయపర్తి, జనవరి 5: మండలంలో దేవాదుల కాల్వల ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. భూములు కోల్పోతున్న ఆరెగూడెం, కేశవాపురం, ఎర్రకుంటతండా, జింకురాంతండా, కొలన్పల్లి, జయరాంతండా(కె) గ్రామాల నిర్వాసితులు బీఆర్ఎస్ నేతల సారథ్యంలో గురువారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఆర్డీవో సీహెచ్ మహేందర్జీ, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ సమక్షంలో ఎర్రబెల్లి భూ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిర్మలాయపల్లి, గన్నారం, జింకురాంతండా, కేశవాపు రం, ఎర్రకుంటతండా, ఆరెగూడెం, కొలన్పల్లి, జయరాంతండా(కె), కొండూరు, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, వాంకుడోతుతండా, కిష్టాపురం, పన్యానాయక్తండా, మొరిపిరాల గ్రామాలకు ఎస్సారెస్పీ కాల్వ లు అందుబాటులో లేకపోవడంతో సాగు జలాలు అందక వ్యవసాయ భూములు పడావుగా ఉంటున్నట్లు తెలిపారు.
రైతుల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పలుమార్లు చర్చించి ఎస్సారెస్పీ కాల్వలు అందుబాటులో లేని గ్రామాలకు దేవాదుల జలాలను తీసుకొచ్చేందుకు కాల్వల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. భూ నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల నాయకులు పూస మధు, వంగాల నర్సయ్య, పెండ్లి రజినీ సుధాకర్రెడ్డి, యాకయ్య, గజ్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మండలంలోని పద్మశాలీల సహాయ సహకారాలు, సంపూర్ణ మద్దతు తన రాజకీయ ప్రస్థానంలో మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని పద్మశాలీలు మంత్రిని కలిసి తమ సమస్యలపై నివేదించారు. ఎర్రబెల్లి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, నాయకులు బందెల బాలరాజు, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్యాదవ్, కొంగ భిక్షపతి, వెంకటేశ్వర్లు, అంకం నర్సయ్య, కొంగ వీరస్వామి, శ్రీనివాస్, శ్రీరామ్, నర్సయ్య, బండారి హరికృష్ణ, చెరుకు నారాయణ, గుమ్మడవెల్లి శ్రీనివాస్, కృష్ణ, వడిచర్ల శ్రీనివాస్, కొంగ శ్రావణ్కుమార్, వేముల రమేశ్ పాల్గొన్నారు. అలాగే, జగన్నాథపల్లి సర్పంచ్ గూడెల్లి శ్రీలతా శ్రీనివాస్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు నంగునూరి అశోక్కుమార్, అనంతుల కృష్ణారెడ్డి, బద్దం రంగారెడ్డి, వే ణుగోపాల్రెడ్డి బృందం ఎర్రబెల్లిని కలిసి పలు సమస్యలను విన్నవించింది. మంత్రి సానుకూలంగా స్పందించారు.