వరంగల్ అర్బన్ : మావోయిస్టు కార్యకలాపాలపై పటిష్ట నిఘా కొనసాగనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీ తరుణ్ జోషి తెలిపారు. బుధవారం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఇతర నేరాలపై చర్యలతో పాటు నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తామన్నారు.