నర్సంపేట, ఏప్రిల్ 23: కరోనా వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలని నర్సంపేట ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్ సూచించారు. పట్టణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడాలన్నారు. టీకా వేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు.
అందరూ అప్రమత్తంగా ఉండాలి
నర్సంపేట రూరల్: కొవిడ్-19పై అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్, ఆకులతండా సర్పంచ్ బానోత్ రాము కోరారు. ఆకులతండా జీపీ కార్యాలయంలో స్థానికులకు భాంజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీధర్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకాను వినియోగించుకోవాలి
నర్సంపేట రూరల్: కరోనా టీకాను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్ బొజ్జ యువరాజ్ కోరారు. జీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో 45 ఏళ్లకు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
అవగాహన కలిగి ఉండాలి
నల్లబెల్లి: కరోనా వ్యాక్సిన్పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బానోత్ సంగూలాల్ అన్నారు. స్థానిక పీహెచ్సీలో సంగూలాల్ సతీమణి శాంతాబాయి వ్యాక్సిన్ తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి మహేందర్నాయక్, వైద్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
ఆత్మకూరు: మండలంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు వైద్యాధికారి రణధీర్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 138 మందికి కరోనా పరీక్షలు చేయగా, 16 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. కరోనా టీకాలపై అపోహలు వీడాలన్నారు. రాత్రిపూట ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కోరారు.
148 మందికి టీకాలు
చెన్నారావుపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 148 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు. అలాగే, మండల పరిధిలో 103 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 21 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్నర్సు స్వరూపారాణి, లలిత, హెల్త్ అసిస్టెంట్ కుండె శివాజీ, సూపర్వైజర్ రామెల్, ఆరోగ్యమిత్ర మహేందర్ పాల్గొన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
దామెర: కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దామెర పీహెచ్సీ వైద్యురాలు శిరీష కోరారు. ఊరుగొండ, కోగిల్వాయి, దామెర ఆరోగ్య ఉపకేంద్రాల్లో జరుగుతున్న కరోనా పరీక్షలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరోనావ్యాప్తి ఎక్కువగా ఉన్న ల్యాదెళ్ల, సింగరాజుపల్లి, వెంకటాపురంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పీహెచ్సీ హెచ్ఈవో అశోక్బాబు, సూపర్వైజర్లు శ్రీకాంత్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
టీకాతో ఎలాంటి ఇబ్బంది లేదు
గీసుగొండ: కరోనా టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యాధికారి మాధవీలత తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 170 మందికి కరోనా టీకాలు వేసినట్లు ఆమె తెలిపారు. అలాగే, 125 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా కట్టడికి టీకా వేసుకోవాలి
దుగ్గొండి: కరోనా వైరస్ కట్టడికి అందరూ టీకా వేసుకోవాలని నాచినపల్లి సర్పంచ్ పెండ్యాల మమతారాజు కోరారు. శుక్రవారం గ్రామంలోని వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కాగా, నాచినపల్లి సర్పంచ్ వారం రోజులుగా గ్రామస్తులను తన సొంత వాహనంలో కరోనా వ్యాక్సిన్ కోసం మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్నారు. గ్రామస్తుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
అఖిల్ ఆశలు ఇప్పట్లో ఫలించేనా..?
చెట్టంత దేవుడికి చెట్టు తొర్రే ఆలయం.. మన తెలంగాణలోనే