కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్
మిర్చియార్డు పరిశీలన..
కాశీబుగ్గ, మే 25 : కొవిడ్ రోజు రోజుకూ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్క రూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్ సూచించారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎనుమాముల మార్కెట్ను బంద్ చేసి, పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మిర్చియార్డును మంగళవారం సందర్శించారు. మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కరోనా వైరస్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి రోజూ అన్ని యార్డుల్లో మైక్ ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఎంవో ప్రసాద్రావు, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, గ్రేడ్-2 కార్యదర్శి తోట చందర్రావు, అసిస్టెంట్ కార్యదర్శులు జన్ను భాస్కర్, సంగినేని శ్రీనివాస్, లాషరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి
కాశీబుగ్గ, మే25 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మిర్చి, పత్తి, పసుపు, పల్లికాయ, ఆపరాల యార్డుల్లో ట్రాఫిక్ సమస్యలను ప రిష్కరించాలని చైర్మన్ చింతం సదానందం ఆదేశించారు. మంగళవారం మా ర్కెట్ పరిధిలో విధులు నర్వర్తించే హోంగార్డ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లోని వివిధ యార్డుల్లో ట్రా ఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కరోనా వైరస్ రెండో దశ తీవ్రమవుతున్నందున యార్డుల్లో రైతులు, వ్యాపారులు, వివిధ కార్మిక వర్గాలు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యార్డుల్లో రైతుల వ్యవసాయ ఉత్పత్తులు చోరీకి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వెంటనే అప్రమత్తంగా ఉండాలన్నారు.