వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్కుమార్
హన్మకొండ సిటీ, మార్చి31 : కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మాస్క్ ధరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పీ ప్రమోద్కుమార్ పిలుపునిచ్చారు. మాస్క్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘బాధ్యతగా మాస్క్ ధరించు.. కరోనా వ్యాప్తిని అరికట్టు.. లేదంటే తప్పదు జరిమానా’ అనే వాల్పోస్టర్ను బుధవారం కమిషనరేట్ కా ర్యాలయంలో డీసీపీలతో కలిసి సీపీ ప్రమోద్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కమిషనరేట్లో మాస్క్ల వినియోగంపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ కే పుష్ప పాల్గొన్నారు.