హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మాదకద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డ్రగ్స్, గంజాయి, గుడుంబా నియంత్రణపై హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారుల సమన్వయ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు రవాణా కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నివారణ చర్యలు ప్రారంభించామని హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు, నర్సంపేటలో రెండు డ్రగ్స్ కేసులు నమోదు చేసినట్లు వరంగల్ కలెక్టర్ గోపి పేర్కొన్నారు.
-హనుమకొండ, ఫిబ్రవరి 5
హనుమకొండ, ఫిబ్రవరి 5 : మాదక ద్రవ్యాల ని యంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. హ నుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డ్ర గ్స్, గంజాయి, గుడుంబా నియంత్రణపై కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధ్యక్షతన జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారుల సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ జనవరి 28న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ నారోటిక్ మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు.
మా దకద్రవ్యాల నియంత్రణపై జిల్లాల్లో ప్రత్యేక నిఘా పె ట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. డ్రగ్స్ ఆరోగ్యాలను ప్ర భావితం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజా న్ని దెబ్బతీస్తుందన్నారు. విద్యా సంస్థలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇత ర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు రాకుండా గట్టి ని ఘా పెట్టాలని, రవాణా చేసే అవకాశం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు సేవిస్తే జరిగే నష్టాల గురించి సామాజిక మాధ్యమాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ డియా ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. గుడుం బా, డ్రగ్స్, గంజాయి నియంత్రణకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని సీపీ హెచ్చరించారు.
డ్రగ్స్ నివారణకు ఇప్పటికే అవసరమైన అన్ని చర్య లు ప్రారంభించినట్లు హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలో అధికారులు, స ర్పంచ్లు, జీపీ కార్యదర్శులు, ఏఈవోలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి సాగు చేస్తే రైతుబంధు రాకుండా పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గంజాయి, డ్రగ్స్, గుడుంబా వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన వాల్పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిషరించారు. సమావేశంలో డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, శ్రీవాత్సవ, హనుమకొండ, వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పీ శ్రీనివాసరావు, వీ శ్రీనివాస్, ఏసీపీలు, పీపీలు, ఏపీపీలు, రైల్వే అధికారులు, డీఆర్డీవోలు, డీపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో డ్రగ్స్ నివారణపై ప్రత్యేక నిఘా పెట్టామని, నర్సంపేటలో రెండు కేసులు కూడానమోదు చేశామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. అందరి సహకారంతో పూర్తిస్థాయిలో గంజాయి, గుడుంబా, డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డీ సురేశ్రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని తెలిపారు. జిల్లాల్లో ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే ఎక్సైజ్ లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.