హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 20 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్(జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం) ఆధ్వర్యంలో తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఆదివారం హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ ఆటలకు స్థలాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి తనవంతుగా ఎంతో కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి స్పోర్ట్స్ కమిటీలో తాను, మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్ సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఒకప్పుడు గ్రామాల్లో జరిగే ఆటలను చూసేందుకు బైకులపై వచ్చేవారని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడున్న క్రీడల్లో అందరూ క్రికెట్ ఆడుతుంటారు కానీ బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ క్రీడలను కూడా ప్రోత్సహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. స్పోర్ట్స్లో ప్రత్యేక నిపుణులను నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాడ్మింటన్ పోటీలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు.
వరంగల్ వైద్య, విద్య రంగాల్లోనే కాకుండా సాహిత్యం, కళలు, సాంస్కృతిక రంగాలు, క్రీడలకు పేరుగాంచిందని చెప్పారు. అర్జున పిచ్చయ్య, వెంకటనారాయణ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రీడలకు తనవంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్కు సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడుతాయని తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్ (జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం) అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల నుంచి 90 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ టోర్నమెంట్స్లో భాగంగా మూడు ఈవెంట్లు మెన్స్ డబుల్స్(నాన్-మెడలిస్ట్స్), 40 ప్లస్, 50 ప్లస్ మెన్స్ డబుల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండురోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్స్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మెన్స్ డబుల్స్ మొదటి విజేతకు రూ.15 వేలు, రన్నర్స్కు రూ.10 వేలు, 40 ప్లస్, 50 ప్లస్ విన్నర్స్కు రూ.10 వేలు, రన్నర్స్కు రూ.5 వేల నగదుతో పాటు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, బ్యాడ్మింటన్ కార్యదర్శి రమేశ్రెడ్డి, జేఎన్ఐఎస్ అసోసియేషన్ కార్యదర్శి పవన్బాబు, కోచ్ కూరపాటి రమేశ్, నిర్వహణ కమిటీ సభ్యులు గడ్డం కేశవమూర్తి, తమ్మడపల్లి రాజు, వైవీ రాజేందర్, పోరిక విజయ్కుమార్, టీ వేణు, విక్రమ్రెడ్డి, కోమాకుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.