హనుమకొండ, అక్టోబర్ 19: ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో 10 కి.మీ మేర పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. బుధవారం హనుమకొండ నక్కల గుట్టలోని హరిత కాకతీయ హోటల్లో పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం జరిగింది. రామప్ప దేవాల యం యునెసో గుర్తింపు సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేయాల్సిన పనులపై టూరిజం సెక్రటరీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాకారం, దేవుని గుట్ట, బుస్సాపూర్ను కలుపుకొని సర్యూట్గా అభివృద్ధి చేయా లన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రామప్ప దేవాల యం అభివృద్ధి నివేదిక, చేయాల్సిన పనులపై అధికారులకు సూచించారు. యునెసో అధికారులకు పంపాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. టూరిజం, ఆరియాలజీ, రామ ప్ప అభివృద్ధి కమిటీ సహకారంతో డోజర్ను పంపిస్తామని తెలి పారు. ఇన్టాక్ కన్వీనర్ పాండురంగారావు మాట్లాడుతూ రామప్ప పరిసరాల అభివృద్ధి నివేదిక నవంబర్ 15 కల్లా అంది స్తామన్నారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొ రేషన్ ఎండీ మనోహర్రావు, హనుమకొండ, వరంగల్ అదన పు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, టూరిజం అధికారి శశిధర్, కుడా టౌన్ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, ఆరియాలజీ అధికా రులు రాములునాయక్, నాగరాజు, కన్సల్టెంట్స్ పాల్గొన్నారు.