హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. రాష్ర్టోపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోద్యమ ఉత్సవం సోమవారం హనుమకొండలోని ఎస్ఎస్వీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్ పాల్గొని ఎస్టీయూ సావనీర్ను విడుదల చేశారు. అనంతరం సారయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ ద్వారా రాష్ట్రంలోని పాఠశాలలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.32 కోట్లతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్యత్తుమమైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఉద్యమంలో ఎస్టీయూ పాత్ర ఎంతో అపూర్వమైందని, పూర్వ అధ్యక్షుడు తిరుపతయ్యతో 4 దశాబ్దాలుగా పరిచయం ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ప్రకాశ్ మాట్లాడుతున్న టెక్నాలజీ, సైన్స్ అసమానతలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పరిజ్ఞానంతో పోల్చితే ప్రైవేట్ పాఠశాలల్లో 10 మందికి కూడా లేదన్నారు. అయినా ఫలితాలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వస్తున్నాయని, వీటిపై ఉపాధ్యాయులు ఆలోచించాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమ తరహాలో ఎస్టీయూకు చాలా గొప్ప చరిత్ర ఉందని, నిజాం కాలంలోనే ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాన్ని ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేశారన్నారు. అనంతరం 50 ఉత్తమ ఉపాధ్యాయులను, 2022 సంవత్సర ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్సీలు అవార్డులు ప్రదానం చేశారు. ఎస్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆట సదయ్య అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వతరెడ్డి, ఆర్థిక కార్యదర్శి భీమనాధుని రవి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేము నూరి రాంబాబు, అసోసియేట్ అధ్య క్షుడు రూపిరెడ్డి సుధాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు నామాని సాంబయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి సూర రమేశ్, కార్యదర్శులు సోలం క్రిష్ణయ్య, ఎన్ రఘుకుమార్, నర్సింహారావు, రాంకిషన్ రాజు, తోట తిరుపతయ్య, మొగిలి, బూర విద్యాసాగర్, తిరువరంగం ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.