మడికొండ, ఫిబ్రవరి 6 : కాజీపేట డివిజన్ను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. కాజీపేట మీడి యా పాయింట్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యు వత డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందన్నారు. యువత సన్మార్గంలో ప యనించాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్శాఖ తీవ్రంగా శ్రమిస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన యువతను రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మామూలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణలో మీడియా సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై ఫణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయిని అరికట్టాలి
గంజాయిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కేయూ ఎస్సైలు సంపత్, సతీశ్ కోరారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి డబ్బాల జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్లు, స్థానికులు, షాపు ల యజమానులకు గంజాయి, గుట్కా, గుడుంబా నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ దురలవాట్లకు బానిసలై ఎంతో మంది తమ కుటుంబాలను దూరం చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క రూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని సూచించారు. నిషేధిత గంజాయి, గుట్కా లు, గుడుంబా వంటివి ఎవరూ వాడవద్దని సూచించారు. ఎవరైనా వాటిని విక్రయిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు ఎల్లప్పుడూ అం దుబాటులో ఉంటారని తెలిపారు.