హనుమకొండ, జూలై 2: వరంగల్ మహానగరంలో నాలాల పరిరక్షణకు టాస్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపి, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధిలో ఉన్న నయీంనగర్, బొందివాగు, భద్రకాళి, సాకరాషికుంట, కట్టమలన్న, చిన్నవడ్డేపల్లి చెరువుల నాలాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, నగర పాలక సంస్థ, సర్వే ల్యాండ్ సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 2020లో వచ్చిన వర్షాల కారణంగా ఏర్పడిన ఇబ్బందులు పునారావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
సీపీ తరుణ్జోషి మాట్లాడుతూ నాలాల పరిరక్షణ విషయంలో వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు ఎకడా రాజీపడొద్దన్నారు. నూతనంగా దరఖాస్తు చేసుకునే వారు పకగా ప్రభుత్వ నియమనిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. సమీక్షలో హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, డీసీపీలు వెంకటలక్ష్మి, అశోక్కుమార్, ఆర్అండ్బీ, ఐబీ ఎస్ఈలు సుధాకర్రెడ్డి, నాగేందర్రావు, సిటీ ప్లానర్ బీ వెంకన్న, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్జీ, సర్వే ల్యాండ్ ఏడీ ప్రభాకర్, ఏసీపీ కిరణ్కుమార్, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.