హనుమకొండ, ఏప్రిల్ 29 : హనుమకొండ హంటర్రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆదివారం రాత్రి బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.40 గంటలకు ఖమ్మం బయల్దేరారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆయనను కలిశారు. బస్సుయాత్రలో ఖమ్మం వెళ్తున్న కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు, అభిమానులు జైకొట్టగా, వారికి అభివాదం చేస్తూ ముందుకుసాగారు.