హనుమకొండ సిటీ, మార్చి 31 : వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ) వివిధ కేటగిరీల్లో 7 అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎండీ గోపాల్రావు మాట్లాడుతూ.. ఒక్క డిస్కంకు ఇన్ని అవార్డులు రావడం ఇదే మొదటిసారని, అవార్డులు రావడానికి కృషి చేసిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. ఈ అవార్డులను ఈనెల 9న కర్ణాటక రాష్ట్రంలోని బెలగాంలో 22వ రెగ్యులలేటర్స్ అండ్ పాలసీ మేకర్ రిట్రీట్ కార్యక్రమంలో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు.
అవార్డుల వివరాలు…
1)బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డు..
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేస్తోంది. దీంతో బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డుకు ఎంపిక చేశారు.
2) బెస్ట్ స్టేట్ టు ప్రమోట్ రెనివబుల్ ఎనర్జీ..
డిస్కం పరిధిలో పునరుత్పాదక విద్యుత్ను ప్రోత్సహిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
3) బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టు
ప్రమోట్ కన్జ్యూమర్స్ అవేర్నెస్..
వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, పత్రికలు, చానళ్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
4) ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ – యుటిలిటీ అచీవింగ్
ఫాస్టెస్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ లాస్ట్ డికేడ్..
2 సంవత్సరాల్లో 2,28,396 గ్రామీణ గృహ వినియోగదారులకు యుద్ధప్రాతిపదికన సర్వీసులు మంజూరు చేసినందుకు అవార్డు లభించింది.
5) ఎరెక్షన్ ఆఫ్ 2/1 ఎంవీఏఆర్ కెపాసిటీ బ్యాంక్స్ అండ్ 600 కేవీఆర్ లైన్ కెపాసిటర్స్..
868 గల 11 కేవీ 2 ఎంవీఏఆర్, 550 గల 2/1 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంక్స్, 33/11 కేవీ సబ్స్టేషన్లలో ఏర్పాటు చేయడం ద్వారా నష్టాలను తగ్గించడం, 431 గల 600 కేవీఏఆర్ లైన్ కెపాసిటర్ పెట్టడం ద్వారా 11 కేవీ ఫీడర్లపై భారం పడకుండా చూడడం ద్వారా ఈ అవార్డు లభించింది.
6) డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ జనరేషన్ ఇన్ టీఎస్ఎన్పీడీసీఎల్
గ్రిడ్ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా సోలార్ పవర్ 33 కేవీ లైన్లను అనుసంధానం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ లోడ్ భారం పడకుండా చేయడంతో ఈ అవార్డు లభించింది.
7) ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్ ఇంట్రిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్
ఐఆర్డీఏ మీటర్లు అమర్చడం ద్వారా మీటరు రీడింగ్లు తప్పులు రాకుండా, రెవెన్యూ బిల్లింగ్ కచ్చితంగా తీయడం, బిల్లుల తప్పిదాలు తగ్గించడం, 88.23 శాతం ఐఆర్డీఏ మీటర్లను అమర్చడం, వినియోగదారులకు ఎస్ఎంఎస్ ద్వారా విద్యుత్ బిల్లుల సమాచారం పంపించినందుకు ఈ అవార్డు లభించింది.