హనుమకొండ చౌరస్తా, మార్చి 16: జిల్లాలోని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హను మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వ హించిన క్రికెట్ పోటీల్లో జిల్లా నుంచి క్రీడాకారు లు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. విజే తగా నిలిచినవారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా క్యాష్ప్రైజ్ అందజేశారు. నగరంలో ఉన్న క్రికెట్ అభిమానులను ప్రోత్స హించడానికి పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహ కుడు ఖుద్దూస్ను వినయ్భాస్కర్ అభినందించా రు. క్రీడాకారులు పోటీలను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వాహకు డు అబ్దుల్ ఖుద్దూస్ ఈద్గా క్రికెట్ అసోసియే షన్(ఐసీసీ) ఆధ్వర్యంలో కాకతీయ క్రికెట్ అకాడ మీ(కేసీఏ) సహకారంతో ‘హనుమకొండ చాంపి యన్ ట్రోఫీ సాఫ్ట్బాల్’ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్స్ 16, 17,19, 20 నాలుగురోజు లపాటు సా యంత్రం 5 నుంచి ఉదయం 3 గంటల వరకు ఫడ్లైట్ల వెలుగులో నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నా యని, రెండు మ హిళా క్రికెట్ జట్లు బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. క్రికెట్ అభిమానులు పోటీలను తిలకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్భాస్కర్ క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్, కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, సీఐ వేణుమాధవ్, 4వ డివిజన్ ప్రెసిడెంట్ కంజర్ల మనోజ్కుమార్, మాజీ అధ్యక్షుడు పేర్ల మనోహ ర్రావు, కేయూ నాయకుడు ప్రేమ్కుమార్, టీఆర్ ఎస్వీ నాయకుడు బైరపాక ప్రశాంత్, హనుమ కొండ జేఏసీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, నిర్వాహకులు సోహిల్, షాకీర్, అస్లామ్, సిరాజ్, మహిమమూద్, ముఖరీమ్, ఇమ్రాన్, ఖలీల్, అఫ్జల్, అజార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లడ్లైట్స్ వెలుగుల్లో క్రికెట్ జోష్
ఫ్లడ్లైట్స్ వెలుగుల్లో క్రికెట్ మ్యాచ్లు అబ్బుర పరిచాయి. ఐపీఎల్ తరహాలో జరిగిన క్రికెట్ మ్యా చ్లను వీక్షించేందుకు అభిమానులు తరలివచ్చా రు. తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగే ఈ డే అండ్ నైట్ మ్యాచ్లు అందరినీ ఆకట్టుకున్నా యి. భారీ స్క్రీన్స్ మధ్య ప్రత్యక్ష ప్రచారాన్ని అందిస్తున్నారు.