హనుమకొండ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హన్మకొండ విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఆదర్శ వివాహం చేసుకున్న నడిపెల్లి శ్రీధర్ రావు, అరుణ దంపతులచే మొక్కలు నాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు..గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.
ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు మల్లికార్జున్, రామస్వామి, విద్యాసాగర్, ఈశ్వరయ్య జాగృతి నాయకులు డా. రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.