కరీమాబాద్, ఫిబ్రవరి 4: వరంగల్ మహానగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వరంగల్ 43 డివిజన్ జక్కలొద్దిలో కార్పొరేటర్ అరుణ ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. విలీన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో విలీన గ్రామాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అనంతరం వరంగల్ 43వ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఇనుగాల జోగిరెడ్డి తల్లి రాజమ్మ(101) ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని అరూరి పరామర్శించారు.
పర్వతగిరి: గోపనపల్లిలో రూ. 45 లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవల పేర్వారం వీరయ్య మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని అరూరి పరామర్శించారు. అలాగే, గోపనపల్లికి చెందిన వార్డు సభ్యుడు నాంపల్లి అన్నయ్య కుమారుడి రిసెప్షన్కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, సర్వర్, సర్పంచ్లు తౌటి దేవేందర్, పంజా మహేశ్, బానోత్ వెంకన్ననాయక్, ఇస్లావత్ దేవేందర్, తిరుపతిరావు, మాసాని వెంకట్, మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట/రాయపర్తి: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేస్తున్నదని చెన్నారావుపేట జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్ అన్నారు. మండలంలోని అమీనాబాద్లో రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. సర్పంచ్లు సిద్ధెన రమేశ్, ఎంపీటీసీ కడారి సునీతాసాయిలు, ఉపసర్పంచ్ ఊరుగొండ లింగన్న, కుమారస్వామి, సాంబయ్య, రమేశ్, శంకర్, రజినీకర్, అబ్బయ్య పాల్గొన్నారు. రాయపర్తి మండలం కొండూరులో సీసీరోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, కొలన్పల్లి పీఏసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్రెడ్డి, పూస మధు, పీఆర్ ఏఈ శేషం కిరణ్కుమార్, సర్పంచ్ కర్ర సరితా రవీందర్రెడ్డి, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.