కరీమాబాద్, సెప్టెంబర్ 26 : పరిసరా లు, వ్యక్తిగత శుభ్రత లేనిదే రక్షణ లేదని గ్రేటర్ వరంగల్ పరిధిలోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరు ణ, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, సోమిశెట్టి ప్రవీణ్ అన్నారు. వరంగ ల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చే పట్టిన సఫాయిమిత్ర-సురక్ష చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని ఆయా డివిజన్లలో కా ర్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చంద న, బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, సోమిశెట్టి ప్రవీణ్ ప్రజలకు అవగాహన క ల్పించారు. సెప్టిక్ట్యాంకు వాడకం, కాల్వల శుభ్రత తదితర అంశాలపై భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
‘సఫాయి మిత్ర’పై విస్తృత ప్రచారం
వరంగల్: సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్-2021పై గ్రేటర్ వరంగల్లోని అన్ని డి విజన్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ల భాగస్వామ్యంలో ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేశారు. సెప్టిక్ ట్యాంకు ల క్లీనింగ్పై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడు నగరాలు పోటీ పడుతుండగా, అందులో వరంగల్ ఉంది. నగ రం నుంచి మానవ వ్యర్థాలను అమ్మవారిపేటలో శుద్ధీకరణ కేంద్రానికి తరలిస్తున్నా రు. 11వ డివిజన్లో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంక్లను క్లీనింగ్ చేసుకోవాలని వివరించారు. 27వ డివిజన్లో కార్పొరేటర్ చింతాకులు అనిల్కుమార్ ఆధ్వర్యం లో ప్రజలకు అవగాహన కల్పించారు. 36వ డివిజన్ కార్పొరేటర్ సువర్ణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్జోషి ఆధ్వర్యంలో సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్పై డివిజన్లో ర్యాలీ నిర్వహించారు.