హనుమకొండ, సెప్టెంబర్ 23 : అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని జోనల్ జాయింట్ కమిషనర్ జీ సునీత పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కార్మిక శాఖ అధికారులు, ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి అసంఘటిత కార్మికుల సభ్యత నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 30న రాష్ట్ర అడిషనల్ కమిషనర్ ఈ గంగాధర్, అసంఘటిత కార్మికుల చైర్మన్ దేవేందర్రెడ్డి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1500 మంది అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఉప కమిషనర్ శ్యాముల్ జాన్, అసిస్టెంట్ కమిషనర్ కే ప్రసాద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీధర్ బాబు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యాంసుందర్, వినోద్, రజిత, వినోద, వేల్పుల సారంగపాణి, దయాకర్, గన్నవరం రమేశ్, తోట సత్యనారాయణ, సంపూర్ణ, దశరథం, రవీందర్, ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి
కాజీపేట : అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యమడాల హనుకాంత్ కోరారు. కాజీపేటలోని సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హనుకాంత్ మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని, సమస్యలను పరిష్కరించడంతో ముందుండాలని పిలుపునిచ్చారు. కమిటీలో నియమితులైన సభ్యులు మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. అంతకుముందు సమితి హనుమకొండ మండల మహిళా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా దార గీత, ఉపాధ్యక్షురాలిగా శిరీష, ప్రధాన కార్యదర్శిగా రజిని, కోశాధికారిగా అంకిత, సభ్యులను ప్రకటించారు. సమావేశంలో స్వప్న, రమ, జీవిత, రాజేశ్వరి, కార్యకర్తలు పాల్గొన్నారు.